Homeటాప్ స్టోరీస్లాక్ డౌన్ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి

లాక్ డౌన్ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి

లాక్ డౌన్ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి
లాక్ డౌన్ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి

ఈ లాక్ డౌన్ సమయంలో వరసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతున్నారు. నిన్ననే కన్నడ నటి ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకున్న విషయం బయటకు వచ్చింది. చాలా సీక్రెట్ గా జరిగిన పెళ్లిని ప్రణీత సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాకా ఎవరికీ తెలీదు.

అలాగే ఇప్పుడు ప్రణీత తర్వాత బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కూడా పెళ్లి చేసుకుంది. యామీ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. గౌరవం, నువ్విలా, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇందులో ఏదీ ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వలేదు. బాలీవుడ్ లో విక్కీ డోనర్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యామీ హీరోయిన్ల రేసులో వెనకబడింది.

- Advertisement -

అయితే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని వైవాహిక జీవితానికి శ్రీకారం చుట్టింది. ఆమె బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ ను వివాహమాడింది. యూరీ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు ఆదిత్య. లాక్ డౌన్ కారణంగా చాలా దగ్గరి వ్యక్తుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. మీ అందరి ఆశీస్సులు తప్పక ఉండాలి అని యామీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All