Homeటాప్ స్టోరీస్అన్ని కోట్ల నష్టాన్ని భరించేదెవరు

అన్ని కోట్ల నష్టాన్ని భరించేదెవరు

who will bear that lossబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం సినిమా అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం కేవలం 10 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది . శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో 13 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది అంటే 23 కోట్లు వచ్చినట్లు కానీ ఈ సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చు 35 కోట్లు అని అంటున్నారు . సినిమా నిర్మాణ పరంగా చూసుకున్నా 12 కోట్ల నష్టం అన్నమాట ! ఇక ఈ సినిమాని ఈరోస్ అనే సంస్థ 40 కోట్లకు కొన్నట్లు కథనాలు వినిపించారు అంటే వాళ్లకు 30 కోట్ల నష్టం అన్నమాట !

నిర్మాణ పరంగా ఖర్చు ప్రకారం చూస్తే 12 కోట్లు , ఈరోస్ పరంగా చూస్తే 30 కోట్ల నష్టం మొత్తానికి సాక్ష్యం చిత్రానికి మాత్రం భారీ నష్టం అన్నది మాత్రం వాస్తవం . అయితే ఈ నష్టాన్ని నిర్మాత కానీ నిర్మాత భరిస్తాడా ? లేక ఈరోస్ భరిస్తుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . బెల్లంకొండ తన తనయుడిని స్టార్ హీరోగా నిలబెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందడం లేదు . మరి ఇప్పుడైనా బెల్లంకొండ మారతాడా ? భారీ బడ్జెట్ ని వదిలేసి సరైన కథ , కథనం ఉన్న సినిమాని చేస్తాడా ? లేక షరా మామూలుగానే భారీ బడ్జెట్ సినిమా చేసి మళ్ళీ దెబ్బ తింటాడా చూడాలి .

- Advertisement -

English Title: who will bear that loss

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All