మెగా డాటర్ కొణిదెల నిహారిక వెడ్డింగ్ ఈ నెల 9న జరగనున్నప విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ ప్రభాకరరావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరగబోతోంది. ఇందు కోసం రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఉదయ్ విలాస్లో భారీ ఏర్పాట్లు చేశారు. వారం ముందుగానే అక్కడ మెగా ఫ్యామిలీ హంగామా మొదలైంది.
వివాహం మరో నాలుగు రోజులు వుండగానే ఈ రోజు (శనివారం) మెగా ప్రిన్సెస్ నిహారికని పెళ్లికూతురిని చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి. గ్రీన్ కలర్ సారీలో చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుల మొగ్గవుతున్న నిహారిక ఫొటోలు, పెళ్లి కూతురిగా ముస్తాబు చేసిన మండపంకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టా వేదికగా అభిమానుల కోసం షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఆదివారం ఉదయ్పూర్ పయనం కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు అటెండ్ కాబోతున్నారు? .. ఎంత మంది వెళుతున్నారు అన్నది హాట్ టాపిక్గా మారింది. నిహారిక ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ, పవన్కల్యాణ్ ఫ్యామిలీతో పాటు అల్లు వారి ఫ్యామిలీ కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఇండస్ట్రీ నుంచి మెగా ప్యామిలీకి అత్యంత సన్నిహితులైన వారు మాత్రమే ఈ వెడ్డింగ్ లో హాజరు కాబోతున్నారట. ఆహ్వానాలు కూడా అత్యంత తక్కువ మందికే అందాయని తెలిసింది.