సోషల్ మీడియాలో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రానికి ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి విషయంలోనూ స్పందించిన విజయ్ దేవరకొండ ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయాడు. కేరళ వరదలు, వీర జవాన్లకు విరాళాలు ప్రకటించడంతోనూ ఎప్పుడూ అందరికంటే ముందు నిలిచిన విజయ్ దేవరకొండ ఈ విపత్కర పరిస్థితుల్లో మాత్రం మాత్రం స్పందించడం లేదు.
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మారహోమాన్ని సృష్టిస్తోంది. ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. దీని ప్రభావం ఇండియాను కూడా తాకింది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలోనే నమోదయి దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. దీని బారి నుంచి దేశ ప్రజలను రక్షించడం కోసం ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ని విధించారు. ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. అయితే కరోనా కారణంగా పని కోల్పోయిన వారి కోసం స్టార్స్ ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు.
చిరు నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు విరాళాలు ప్రకటిస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం సైలెంట్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందికంటే ముందే స్పందించిన విజయ్ దేవరకొండ కరోనా విజృంభిస్తున్న వేళ మాత్రం అస్సలు స్పందించడం లేదు. సైలెంట్గా వుంటున్నారు. కారణం ఏంటీ? అన్నద మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇంటి పట్టునే వుంటూ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కాలక్షేపం చేస్తుండటంతో అంతా అవాక్కవుతున్నారు.