శృతీహాసన్ ఇటీవల మైఖేల్ క్రోసల్తో ప్రేమాయణాన్ని సాగించిన విషయం తెలిసిందే. తను డేటింగ్ చేస్తున్న విషయాన్ని తండ్రి కమల్హాసన్తో పాటు అభిమానులతోన పంచుకున్న శృతీహాసన్ ఇటీవల అతనితో విడిపోతున్నట్టు వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత నుంచే సినిమాల్లో నటించడం మళ్లీ మొదలుపెట్టింది.
ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న `క్రాక్` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మేలో రిలీజ్ కావాల్సింది కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇదిలా వుంటే శృతిహాసన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన మానసిక స్థితి మెరుగు పడటం కోసం గత మూడేళ్లుగా మానసికంగా మెరుగు పడటం కోసం చికిత్స చేయించుకున్నాను. ప్రజల్లో చాలా మందికి ఇది అవసరమని అనుకుంటున్నాను` అని చెబుతోంది.
లాక్డౌన్ విధించడంతో ముంబైలోనే వుంటున్న శృతిహాసన్ సోషల్మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులకు అందుబాటులో వుంటోంది. నిత్యం వరుస పోస్ట్లు, ఫొటోలు షేర్ చేస్తోంది. శృతిహాసన్ చేతిలో తెలుగులో వున్న ఏకైక చిత్రం `క్రాక్`. అయితే `వకీల్సాబ్`లో అతిథి పాత్ర కోసం మేకర్స్ సంప్రదిస్తే ఆఫర్ని సున్నితంగా తిరస్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం తెలిసిందే.