కెరీర్ తొలి నాళ్ల నుంచి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అతనో రెబల్. వరుస వివాదాలు చుట్టుముట్టినా ఎలాంటి బెరుకు అతనిలో కనిపించదు. దేన్నైనా సింపుల్గా తీసుకునే ఆ హీరో మరెవరో కాదు విశ్వక్సేన్. కేవలం 12 లక్షలతో `వెళ్లిపోమాకే` చిత్రాన్ని రూపొందించి దిల్ రాజు చేత రిలీజ్ చేయించి శభాష్ అనిపించుకున్నాడు.
తనకు అవకాశం ఇవ్వకుండా అవమానించారని తానే నిర్మాతగా, దర్శకుడిగా మారి `ఫలక్నుమాదాస్` చిత్రంతో సంచలనం సృష్టించారీ యువ హీరో. ఈ సినిమాతో వివాదాల్లోనూ ఇరుక్కున్న విశ్వక్సేన్ తాజాగా `హిట్` సినిమాతో సాలీడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడితో `పాగల్` సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయింది.
తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచాడు విశ్వక్సేన్. `ఫలక్నుమాదాస్` చిత్రంతో దర్శకుడిగా మారిన ఈ రెబల్ హీరోకు స్టార్ హీరో మహేష్ని డైరెక్ట్ చేయాలని వుందట. ఛాన్స్ ఇస్తే తనేంటో నిరూపిస్తా అంటున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించి షాకిచ్చాడు. మహేష్ నటించిన `ఒక్కడు` చిత్రం తనకు ఆల్ టైమ్ ఫేవరేట్ అని మహేష్ ఒక్క ఛాన్స్ ఇస్తే అంతకు మించిన సినిమా తీసి చూపిస్తానని అంటున్నాడు విశ్వక్సేన్ మరి మహేష్ ఆ ఛాన్స్ ఇస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.