టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఓ మూవీ షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లిన ఆయన నివర్ తుఫాన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయారు. నివర్ తుఫాన్ ఇప్పటికే తమిళనాడుని వణికిస్తోంది. కారైక్కాల్, మామల్లపురం మధ్యన తీరం దాటబోతోంది. ఏపీలోనూ దీని ప్రభావం వుండబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నివర్ తుఫాన్ ప్రభావం పాండిచ్చేరిని కూడా తాకింది. దీంతో అక్కడే ఓ మూవీ షూటింగ్ కోసం వున్న హీరో విశ్వక్సేన్ అక్కడే వుండిపోయారట. విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం `పాగల్`. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం పాండిచ్చేరి వెళ్లింది. అయితే తుఫాను కారణంగా ఈ మూవీ షూటింగ్కి టీమ్ బ్రేక్ ఇచ్చేసింది. నివర్ ప్రభావంతో పాండిచ్చేరిలో వర్షాలు ప్రారంభం కావడంతో `పాగల్` టీమ్ షూటింగ్ని వాయిదా వేశారు.
దీంతో అక్కడే వుండిపోయిన హీరో విశ్వక్సేన్ మాత్రం పాండీచ్చేరి వీధుల్లో విహరిస్తూ సందడి చేస్తున్నాడు. ఐస్క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఎంజాయ్మెంట్ కి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశ్వక్సేన్ నటిస్తున్న `పాగల్` మూవీ ద్వారా కుప్పిలి నరేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.