రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. సలార్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కన్ఫర్మ్ అయింది. వీలైనంత తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో విలన్ ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ప్రభాస్ వంటి భారీ కటౌట్ ఉన్న హీరోకి విలన్ అంటే ఆ స్థాయిలోనే ఉండాలి. ఈ నేపథ్యంలో విలన్ గా రకరకాల పేర్లు వినిపించాయి కానీ అందులో నిజం లేదు. తాజా సమాచారం ప్రకారం సలార్ లో విలన్ గా మధు గురు స్వామి నటిస్తున్నాడని తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఇతనికి చాలా పేరుంది. భారీ కటౌట్ తో విలనిజం పండించడానికి సరిగ్గా సరిపోతాడు.
దాదాపు కేజిఎఫ్ టీమ్ నే ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే.