ఇది సినిమాలో జరిగినది కాదు, నిజంగానే జరిగిన వార్త. మొన్ననే కదా మనం చదివింది సీనియర్ కథానాయకి ‘భాను ప్రియ‘ గారు పని మనిషి విషయంలో చిన్న పిల్లని పెట్టుకున్నారని, ఆమెని పోలీసులు విచారిస్తున్నారని తెలిసింది. ఇప్పుడు అలాంటి సంఘటన ఇద్దరు సీనియర్ కథానాయికలకు జరిగింది. వివరాల్లోకి వెళ్తే
ఒకప్పటి గ్లామరస్ కథానాయికలు ‘రంభ’, ‘రాశి’ లకి విజయవాడ కన్జూమర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. వీళ్ల్లు చేసిన తప్పు జనాలని తప్పుడు ప్రకటనలు ద్వారా నమ్మించడం. ‘కలర్స్’ అని రోజు టీవీ లో చూస్తుంటాం కదా… మీ బరువు తగ్గించుకోండి, బరువు తగ్గకపోతే మీ డబ్బు వాపసు తీసుకోండి అని పదే పదే తెగ ప్రకటనలు వచ్చేసరికి జనాలు నమ్మేసేవారు.
నిజానికి రంభ, రాశి ఇద్దరు ఆ మధ్య బొద్దుగా అయ్యారు . మళ్ళీ సినిమాలు, టీవీ షోల వల్ల వారు నాజుకుగా అయ్యారు. ఆలా అవ్వటం మా వల్లే అని కలర్స్ వాళ్ళు తెగ హడావిడి చేసి వీడియోస్ జనాల మీదికి వదిలే వాళ్ళు. అది చూసి విజయవాడ అబ్బాయి నేను కూడా సన్నగా అవ్వాలి అని చెప్పి 74,652 తన ట్రీట్మెంట్ కి కట్టేసారు. ఇక రోజులు లెక్కపెడుతుండగా ఎంతకీ లావు తగ్గని తను కలర్స్ వాళ్ళని అడిగితే టైం పడుతుంది అని రొటీన్ సమాధానం చెప్పేవారంటా.
అలా తను ఓపిక తెచ్చుకొని విజయవాడ కన్జూమర్ కోర్టు వారిని ఆశ్రయించారు. వారు కూడా సమస్యని క్లుప్తంగా పరీక్షించి తప్పు కలర్స్ వాళ్ళది అని చెప్పి అబ్బాయికి తన మొత్తం డబ్బు 74,652 తో పాటు 9 % అధిక వడ్డీ కూడా ఇవ్వమన్నారు. అయితే తప్పు కలర్స్ వాళ్ళది ఎంత ఉందొ, కథానాయికలది కూడా అంతే ఉందని మొదట వీరువురికి కూడా ఫైన్ వేద్దాం అనుకున్న కోర్ట్, మొదటి సారి కాబట్టి క్షమించి వదిలేశారు.
చూసారా కలర్స్ ప్రోగ్రాం అనేది చిన్న కంపెనీ, వాళ్ళకి జనాల మద్దతు రావాలని చెప్పి జనాలని ఇలా మోసం చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి వాటికి కంప్లైంట్ ఇస్తే ఏమి అవుతుందా? అని భయపడకుండా మాకు వచ్చి కంప్లైంట్స్ చేయండి… అలా అయితేనే ఇలాంటి మార్కెటింగ్ కంపెనీ వాళ్ళకి తగిన భయం ఉంటుంది అని అన్నారు విజయవాడ కన్స్యూమర్ కోర్ట్.
నిజమే కదా..మనం కూడా వీడియోస్ చూడగానే నిజమో, అబద్దమో అని ఆలోచించకుండా వెళ్లిపోవడం సరికాదు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి చూసి రంభ, రాశి కథానాయికలకు మంచి గుణపాఠం అని చెప్పవచ్చు. మీరు కూడా జాగ్రత్త……