Homeటాప్ స్టోరీస్విజయవాడ వెళ్లిన కేసీఆర్

విజయవాడ వెళ్లిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయవాడ వెళ్ళాడు . కొద్దిసేపటి క్రితం స్పెషల్ ఫ్లయిట్ లో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న కేసీఆర్ విమానాశ్రయం నుండి నేరుగా విజయవాడ లోని ఓ స్టార్ హోటల్ కు వెళ్ళాడు . అక్కడి నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు కొండ మీదకు వెళ్ళాడు . తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారి దర్శనం కోసం వస్తుండటంతో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసారు దేవాదాయ శాఖ అధికారులు .

- Advertisement -

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుండి శారదా పీఠాధిపతిని కలవనున్నారు కేసీఆర్ . శారదా పీఠాధిపతి నిర్వహించే పూజలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో కలిసి కేసీఆర్ కూడా పాల్గొననున్నారు . కేసీఆర్ బెజవాడ రావడంతో అక్కడ భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేసారు కేసీఆర్ అభిమానులు . హైదరాబాద్ లో న్యూ ఎం ఎల్ ఏ క్వార్టర్స్ ని ప్రారంభించిన అనంతరం విజయవాడ వెళ్లారు కేసీఆర్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All