పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తున్నారు. `రాధేశ్యామ్` చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో మరో రెండు చిత్రాల్ని పట్టాలెక్కించడానికి ప్రభాస్ నెడీ అవుతున్నారు. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న `ఆదిపురుష్` ఒకటి కాగా మరొకటి `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ `సలార్`.
`కేజీఎఫ్` ఫేమ్ విజయ్ కిరగందూర్ హొంబలే ఫలింస్ బ్యానర్పై అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీని ఇటీవలే హైదరాబాద్లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఓ సమూహాన్ని రక్షించడం కోసం ముందు నిలిచే ఓ యోధుడి తరహా కథతో `సలార్` దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు.
త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ప్రభాస్ని ఢీకొట్టేది తమిళ హీరో విజయ్ సేతుపతి అని ప్రచారం జరుగుతోంది. ఇటీవల `మాస్టర్` చిత్రంలో విజయ్ సేతుపతి విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ నటన నచ్చి దర్శకుడు ప్రశాంత్ నీల్ `సలార్`లో విలన్గా నటించే అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.