అల్లు అర్జున్ `అల వైకుంఠపురము` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్తో మాంచి జోష్ మీదున్న బన్నీ వెంటనే మాస్ మసాలా ఎంటర్టైనర్ నేపథ్యంలో నటిస్తున్న చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ సంస్థతో కలిసి ముత్యంశెట్టి మీడియా నిర్మిస్తోంది. `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ తరువాత బన్నీ ఆలోచన తీరు మారింది. ఆ కారణంగానే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రీలీజ్ చేయబోతున్నారు. అందుకు తగ్గట్టే ఈ నాలుగు భాషలకు సంబంధించిన నటీనటుల్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకున్న చిత్ర బృందం తాజాగా కన్నడ నుంచి `భైరవగీత` ఫేమ్ ధనంజయని ఓ స్పెషల్ రోల్ కోసం ఫైనల్ చేశారిన తెలిసింది.
ఇందులో విలన్గా బాలీవుడ్ హీరో సునీల్శెట్టిని సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రం నుంచి విజయ్ సుతుపతి తప్పుకున్నట్టు తెలిసింది. కారణం ఈ చిత్రంలో ఆయన పాత్ర ఫారెస్ట్ ఆఫీసర్. ఆ పాత్ర చాలా మాసీవ్గా వైల్డ్గా వుంటుందట. ఇలాంటి పాత్ర చేయడం వల్ల హీరోగా తన కెరీర్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం వుందని గ్రహించిన విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.