అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కన్నడ క్రేజీ గళ్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవల విడుదల చేసి చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్ కానీ ఈ సినిమాలో మాత్రం మాసీవ్ స్టార్గా కనిపించబోతున్నారు. లారీ డ్రైవర్గా రగ్గ్డ్ క్యారెక్టర్లో ఆయన కనిపించబోతున్నారు. శేషాచలం అడవుల నేపథ్యంలో గంధపు చక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ చిత్రాన్ని ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా `రంగస్థలం` తరహా రియలిస్టిక్ చిత్రంగా తెరపైకి తీసుకురాబోతున్నారు.
సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇందులో దక్షిణాదికి చెందిన పేరున్న నటీనటులని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారని తెలిసింది. బాలీవుడ్ హీరో విలన్గా నటించనున్న ఈ చిత్రంలో కన్నడ హీరో ధనంజయ ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఇప్పటికే ఆయనని చిత్ర బృందం సంప్రదించిందని, ధనంజయ ఇందులో నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ధనంజయ `భైరవగీత` చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.