Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ టార్గెట్ రీచ్ అయ్యాడు!

విజ‌య్ దేవ‌ర‌కొండ టార్గెట్ రీచ్ అయ్యాడు!

విజ‌య్ దేవ‌ర‌కొండ టార్గెట్ రీచ్ అయ్యాడు!
విజ‌య్ దేవ‌ర‌కొండ టార్గెట్ రీచ్ అయ్యాడు!

ప్ర‌పంచాన్ని క‌రోనా వ‌ణికిస్తోంది. దీని కార‌ణంగా కోట్ల‌ల్లో జ‌నం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా త‌గ్గ‌డం లేదు. రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఏ రాష్ట్రం లెక్క‌లు చూసినా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుల‌ని ఆదుకోవ‌డానికి సినీ సెల‌బ్రిటీలు, కార్పొరేట్ సంస్థ‌లు, ఎన్జీఓస్‌, పారిశ్రామిక వేత్త‌లు విరాళాల రూపంలో భారీగా ప్ర‌ధాన మంత్రి, ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి భారీ మొత్తాల్ని అంద‌జేశారు.

ఇదీ కాకుండా ఇండ‌స్ట్రీ కార్మికుల కోసం సీసీసీకి కూడా భారీ స్థాయిలోనే విరాళాలు అందాయి. వాటి ద్వారా సినీ కార్మికుల్ని ఆదుకుంటున్నారు. ఇదిలా వుంటే మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ని ఆదుకోవ‌డం కోసం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ది దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్ ద్వారా  మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో అవ‌స‌రం వున్న వారికి నిత్యావ‌స‌ర స‌రుకుల్ని అందించే కార్య‌క్రమానికి శ్రీ‌కారం చుట్టారు. సీసీసీకి 5 ల‌క్ష‌లు అంద‌జేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ మిడిల్ క్లాస్ ఫండ్ ని 25 ల‌క్ష‌ల‌తో 2500 కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాల‌ని అందించాల‌ని ప్రారంభించాడు.

- Advertisement -

అయితే దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌కు  విరాళాల రూపంలో ఊహించిన దానికి భిన్నంగా 50 ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌చ్చాయి. దాంతో 2500 మందికి సాయం చేయాల‌నుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ 7500 కుటుంఆబ‌ల‌కు స‌హాయాన్ని అందించ‌డం అభినంద‌నీయం. ఇదిలా వుంటే ఇంకా 70,000 అప్లీకేష‌న్‌లు పెండింగ్‌లో వున్నాయి. వారంద‌రికీ స‌హాయం అందించాలంటే 7 కోట్లు కావాలి. దాంతో ప్ర‌స్తుతానికి ఈ కార్య‌క్ర‌మానికి తాత్కాళిక విరామాన్నిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సాయంతో విజ‌య దేవ‌ర‌కొండ 300 % విజ‌యం సాధించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All