మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. దేవాదాయ భూముల స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్చరణ్తో కలిసి నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎనిమిది నెలల విరామం తరువాత ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో మొదలైంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కీలక అతిథి పాత్రలో రామ్చరణ్ కనిపించబోతున్నారు.
ఈ మూవీ తరువాత మెగాస్టార్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ `వేదాలం` రీమేక్లో నటించబోతున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. చిరుపై ఇప్పటికే లుక్ టెస్ట్ని కూడా చేశారు. సినిమాలోని ఓ సన్నివేశంలో చిరు గుండుతో కనిపించాలట. ఇందు కోసం ఆ మధ్య గుండ్ లుక్ టెస్ట్ లో చిరు పాల్గొన్న విషయం తెలిసిందే. కోల్కతా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. అక్కడే కీలక ఘట్టాలని చిత్రీకరించానున్నారట. దసరా నేపథ్యంలో అక్కడ జరిగే ఉత్సవాల్లో కీలక ఘట్టాలని షూట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఇప్పటికే కోల్కతా వెళ్లిన టీమ్ అక్కడ కొంత భాగం షూటింగ్ కూడా చేసినట్టు చెబుతున్నారు. చిరు లేకుండానే షూటింగ్ చేసుకుని వచ్చారట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించనున్న ఈ మూవీలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.