విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది . వరలక్ష్మి శరత్ కుమార్ – విశాల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దాంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని పుకార్లు కూడా వచ్చాయి . కట్ చేస్తే మేమిద్దరం స్నేహితులం మాత్రమే అని చెప్పడమే కాకుండా విశాల్ అనీషా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు . ఇక గొడవ విషయానికి వస్తే …….
నడిగర్ సంఘం ఎన్నికలు సమీపించాయి . ఈనెల 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనున్నాయి దాంతో మళ్లీ పోటీ చేస్తున్న విశాల్ వర్గానికి గట్టి పోటీ ఎదురయ్యింది . దాంతో శరత్ కుమార్ పై మళ్ళీ విమర్శలు ఎక్కుపెట్టాడు విశాల్ . అదే వరలక్ష్మి కి నచ్చలేదు ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో శరత్ కుమార్ పోటీ చేయడం లేదు . మా నాన్న ని ఎందుకు విమర్శిస్తున్నావ్ ? అతడు పోటీ చేయడం లేదు కదా ! ఇప్పుడు నువ్ చేయాల్సింది నీ పదవీకాలంలో నువ్ చేసిన పనుల గురించి అంతేకాని పోటీలో లేని మా నాన్నని తిట్టడం కాదు . నువ్ దిగజారి పోయావ్ విశాల్ …….. ఈసారి నా ఓటు నీకు వేయను అంటూ విశాల్ పై నిప్పులు చెరిగింది .