స్టార్ హీరో మహేష్.. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ `మహర్షి`. దిల్రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ని అందించింది. సరైన టైమ్లో తనకు మరో హిట్ మూవీ పడటంతో చాలా హ్యాపీగా ఫీలైన మహేష్ వెంటనే వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు.
దీనికి సంబంధించిన స్టోరీ డిస్కర్సన్స్ జరిగాయి. అయితే వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ లైన్ మహేష్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో వంశీని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్ పరశురామ్కు మహేష్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో ప్రస్తుతం `సర్కారు వారి పాట` తెరపైకి రాబోతోంది. ఇదిలా వుంటే ఇటీవల ముంబైలో మహేష్తో కలిసి వంశీ సరదాగా కనిపించడంతో మళ్లీ వంశీతో మహేష్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ కోసం ఓ స్టోరీని సిద్ధం చేస్తున్న వంశీ పైడిపల్లి దీనిక `స్టేట్రౌడీ` అనే టైటిల్ని అనుకుంటున్నారట. ఇదిలా వుంటే జనవరి నుంచి కొత్త ప్రాజెక్ట్ని వంశీ పైడిపల్లి ప్రారంభించబోతున్నట్టు తెలిసింది. అయితే అది సినిమా మాత్రం కాదు వెబ్ సిరీస్. `ఆహా` కోసం వంశీ పైడి పల్లి భారీ వెబ్ సిరీస్ని ప్లాన్ చేశారట. దీనికి సంబంధించిన షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనిక కోసం భారీ గానే బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఇందులో నటించే నటీనటులు ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు వంటి విషయాలు త్వరలోనే బయటికి రానున్నట్టు తెలిసింది.