Homeగాసిప్స్వంశీ మరో కొత్త కథను వినిపించాడా?

వంశీ మరో కొత్త కథను వినిపించాడా?

వంశీ మరో కొత్త కథను వినిపించాడా?
వంశీ మరో కొత్త కథను వినిపించాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదికి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మూడు నెలలు బ్రేక్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాను చేస్తానని చెప్పాడు మహేష్. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిన సంగతి తెల్సిందే. వంశీ చెప్పిన ఫైనల్ నరేషన్ నచ్చకపోవడంతో వెంటనే సినిమాను మొదలుపెట్టలేని పరిస్థితి. అలా అని చెప్పి ఇప్పుడు వంశీ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కనపెట్టేయలేదు.

పైడిపల్లి అంటే మహేష్ కు అపారమైన నమ్మకం. అందుకే వేరే కథతో రమ్మని వంశీకి చెప్పడం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ దర్శకుడు మహేష్ బాబుకు సరికొత్త లైన్ ను చెప్పాడట. అది మహేష్ కు కూడా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లుగా సమాచారం. ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు తాను షూటింగ్ ను రెడీ అని చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ఇందుకోసం మహేష్ ఏమీ డెడ్ లైన్స్ పెట్టలేదు. ఈలోపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ రోల్ పూర్తి చేస్తాడు. అలాగే పలు బ్రాండ్ల యాడ్ లకు మహేష్ షూట్ చేయాల్సి ఉంది. ఆ పనులను చూసుకుంటాడు. తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు పరశురామ్ కూడా మహేష్ సినిమా అంటే ఆసక్తి చూపిస్తున్నాడు. పరశురామ్ గతేడాది కాలం నుండే మహేష్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పట్ల కూడా మహేష్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరు బెటర్ కథతో వస్తే వాళ్లతో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నాడు. మరి మహేష్ తర్వాతి సినిమాపై సస్పెన్స్ తొలగిపోవాలంటే మాత్రం మరో నెల రోజులైనా వేచి చూడక తప్పదేమో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All