మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దాదాపు 9మంది హీరోలున్నారు. పదవ హీరోగా మేగామేనల్లుడు సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవీమేకర్స్తో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ క్రితి శెట్టి హీరోయిన్గా పరిచయం అవుతోంది.
ఫస్ట్లుక్ రిలీజ్ నుంచి ఈ సినిమా ఏదో కొత్త కథని చెప్పబోతోందని, ఇదొక విభిన్నమైన ప్రేమకథ అని అర్థమవుతోంది. వైష్ణవ్తేజ్కిది తొలిసినిమానే అయినా అనితో మంచి ఈజ్ కనిపిస్తోంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. సింధూరపువ్వు తరహాలో ఈ సినిమా వుంటుందా? లేక జాలరి జీవితం నేపథ్యంలో సాగే ప్రేమకథగా వుంటుందా అన్నది తెరపైనే చూడాలి.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన `ఊపిరి మొత్తం ఉప్పెనైతే..` అంటూ సాగే సాంగ్ టీజర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులోని సన్నివేశాల్లో సెలూన్ షాప్ గద్దెలపై కూర్చున్న వైష్ణవ్తేజ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఇందులో గమ్మత్తేంటంటే వైష్ణవ్తేజ్ కూర్చున్న జోట సెలూన్ షాప్ రెంబు వైపులా వున్న డోర్లపై ఓ పక్క మెగాస్టార్ చిరు పెయింటింగ్, మరో డోర్పై పవర్స్టార్ పవన్కల్యాణ్ పెయింటిక్ మధ్యలో వైష్ణవ్తేజ్ వుండటం మెగా ఫ్యాన్స్ని ఎట్రాక్ట్ చేస్తోంది. కొత్త తరహా ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది.