ప్రభాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ల్ స్టోరీ `జాన్` (వర్కింగ్ టైటిల్ ). `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అత్యంత భారీ స్థాయిలో పిరియాడిక్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్ర బృందం రిస్క్ చేసి మరీ జార్జియా వెళ్లి కీలక సన్నివేశాల్ని పూర్తి చేసింది.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రమాదం అని తెలిసినా చిత్ర బృందం కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చింది. అయితే ఉగాదికి ఈ చిత్ర టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని రిలీజ్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు కానీ జరగలేదు. ఆ తరువాతైనా ఫస్ట్ లుక్ రిలీజ్ వుంటుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది.
దీంతో యువీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాన్స్కి వివరణ ఇచ్చిన యువీ మే మూడవ వారంలో ప్రభాస్ ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట. మే 3 వరకు లాక్ డౌన్ వుండటంతో ఆ తరువాత అంటే మూడవ వారంలో ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.