భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రి గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు మహేష్ బాబు కాగా తాజాగా తన సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఓ ముఖ్యమంత్రి రావడం తో ఆ ముఖ్యమంత్రి కి సాదర స్వాగతం పలికాడు యాక్టింగ్ ముఖ్యమంత్రి మహేష్ బాబు . భరత్ అనే నేను చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న మహేష్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేస్తున్నాడు .
ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈరోజు డెహ్రాడూన్ లో ప్రారంభమైంది . కాగా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రావడంతో ఆ చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసారు . మహేష్ బాబు కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే . మహేష్ తో కొంతసేపు మాట్లాడాకా ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేసి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ . మహేష్ బాబు – త్రివేంద్ర సింగ్ రావత్ కలిసి ఉన్న ఫోటో షోషల్ మీడియాలో సర్కిల్ అవుతోంది .