Homeటాప్ స్టోరీస్మెగా కుర్రాడి ముందు భారీ టార్గెట్ ఉందిగా!

మెగా కుర్రాడి ముందు భారీ టార్గెట్ ఉందిగా!

మెగా కుర్రాడి ముందు భారీ టార్గెట్ ఉందిగా!
మెగా కుర్రాడి ముందు భారీ టార్గెట్ ఉందిగా!

ఎవరైనా కొత్త హీరో పరిచయమవుతున్నాడంటే చాలా జాగ్రత్తగా సినిమా తీస్తారు. ఉన్నంతలో తక్కువలోనే సినిమా అవ్వగొట్టాలని చూస్తారు. టాప్ హీరోల వారసుల సంగతి పక్కనపెడితే మిగిలిన వారికి పది కోట్ల లోపు బడ్జెట్ అయితేనే సేఫ్. మెగా హీరోలు అయినా కానీ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారికి తొలి చిత్రానిక పది కోట్ల లోపు టార్గెట్ ఉంది. అయితే టాలీవుడ్ లో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్న సంగతి తెల్సిందే. ఉప్పెన చిత్రం ద్వారా ఈ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు.

అయితే అందరిలా చిన్న టార్గెట్ తో ఏమీ ఈ హీరో రావట్లేదు. ఈ కుర్ర హీరో ముందు చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఏకంగా 25 కోట్లు ఉప్పెన మీద పెట్టారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తై ఏప్రిల్ 2న విడుదల కోసం ఎదురుచూస్తోంది.

- Advertisement -

కథ మీద నమ్మకంతో ఈ చిత్రంపై భారీగా వెచ్చించారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అందుకోసం 3 కోట్ల దాకా అయిందని తెలుస్తోంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ కూడా చిన్న చిత్రమైనా కూడా టాప్ సినిమాల స్థాయిలోనే రెమ్యునరేషన్ ను తీసుకున్నాడట. వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ కావడంతో ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగింది. వెరసి ఈ చిత్రానికి 25 కోట్లు టార్గెట్ గా మారింది.

అయితే ఇంత టార్గెట్ ఉన్నా కానీ ఎక్కడా నిర్మాతలు జంకాట్లేదు. ఉప్పెన చిత్రానికి మొదటినుండీ అంతా పాజిటివ్ గా ఉంది. విడుదలైన రెండు పాటలకు రెస్పాన్స్ అదిరిపోయింది. పైగా జంట కూడా బాగుందంటున్నారు. ఇక సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఓ రేంజ్ వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All