యూట్యూబ్లో తెలుగు పాటల హంగామా మొదలైంది. అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో`ని పాటలు యూట్యూబ్లో సంచలనం సృష్టించాయి. 100 మిలియన్ల వ్యూస్ని అధిగమించి తెలుగు సినిమా పాటల్లో సరికొత్త రికార్డుని సృష్టించాయి. ఇప్పుడు ఇదే తరహాలో యాంకర్ ప్రదీప్ నటించిన `30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ` చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` 100 మిలియన్ వ్యూస్ దాటి ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ ఫీట్కి కొత్త హీరో సినిమా `ఉప్పెన` చేరువ కాబోతోంది. సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోని `నీ కన్ను నీలి సముద్రం..` అంటూ సాగే ఫస్ట్ సింగిల్ 50 మిలియన్ల వ్యూస్ దాటడం విశేషం.
రొమాంటిక్ లవ్స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా కారణంగా ఈ చిత్ర రిలీజ్ని వాయిదా వేశారు. ఈ నెలఖరున లాక్డౌన్ ఎత్తేయనున్న నేపథ్యంలో పరిస్థితులని బట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ తొలి హిట్ని సొంతం చేసుకోవడం గ్యారంటీ అంటున్నారంతా.