Homeటాప్ స్టోరీస్అవన్నీ రూమర్లే.. ఉప్పెనకు సర్వం సిద్ధం

అవన్నీ రూమర్లే.. ఉప్పెనకు సర్వం సిద్ధం

అవన్నీ రూమర్లే.. ఉప్పెనకు సర్వం సిద్ధం
అవన్నీ రూమర్లే.. ఉప్పెనకు సర్వం సిద్ధం

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో అరంగేట్రం ఉప్పెన చిత్రం ద్వారాజరగబోతోంది. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా తెరకు పరిచయం కానున్నాడు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత భావించారు కానీ కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. అయితే థియేటర్లు ఓపెన్ అవ్వడానికి ఆలస్యమవుతుండడంతో ఉప్పెన ఓటిటిలో విడుదలవుతుందని రూమర్లు మొదలయ్యాయి. దీనిపై ఇప్పటికే నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఎంత ఆలస్యమైనా కానీ ఉప్పెన చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు.

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ తో కలిసి సుకుమార్ నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఉప్పెన చిత్రాన్ని చిరంజీవి చూసి కొన్ని చోట్ల మార్పులు సూచించాడని అన్నారు.

- Advertisement -

అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అవన్నీ వట్టి రూమర్లేనని తేలింది. అసలు విషయమేమిటంటే బుచ్చిబాబుతో కలిసి సుకుమార్ ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ ను పూర్తి చేసాడట. 2 గంటల 30 నిమిషాల లోపే ఈ సినిమా వచ్చినట్లు సమాచారం. ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ తో ఈ సినిమా ఎడిటింగ్ రెండు రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక సెన్సార్ కు వెళ్లడమే తరువాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All