Homeటాప్ స్టోరీస్ఉప్పెన డిసెంబర్ కి కదిలిందా?

ఉప్పెన డిసెంబర్ కి కదిలిందా?

ఉప్పెన డిసెంబర్ కి కదిలిందా?
ఉప్పెన డిసెంబర్ కి కదిలిందా?

మరో మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి అభిమానులను ఆకర్షిస్తూ వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని భావించారు. దానికి తగ్గట్లుగానే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. తర్వాత మే 7న విడుదల చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేసారు. అయితే ఇదంతా కరోనా ఎఫెక్ట్ మన దేశమ్మీద ఎంత ఉందో తెలియనప్పుడు. అప్పట్లో దీన్ని తక్కువ అంచనా వేశారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తోంది. కరోనా ఎఫెక్ట్ ఇప్పట్లో తగ్గేది కాదని దాని తదనంతరం కూడా ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని అంటున్నారు. సురేష్ బాబు, రాజమౌళి వంటి సినిమా పెద్దలు థియేటర్లు మరో మూడు, నాలుగు నెలలు తెరవకపోవచ్చని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉప్పెన విడుదలపై నిర్మాతలు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉప్పెనను ఏకంగా డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అప్పటికైతే పరిస్థితులు పూర్తిగా సద్దుమణుగుతాయని ఉప్పెన నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాక హడావిడిగా విడుదల చేసినా కానీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో తెలీదు కాబట్టి డిసెంబర్ లో అయితే పరిస్థితిలో మార్పు వస్తుందని సుకుమార్ మరియు నిర్మాతలు భావిస్తున్నారు.

- Advertisement -

వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే తన క్యూట్ లుక్స్ తో యువత మనసును ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. బుచ్చి బాబు సన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All