కరోనా వైరస్ టీవీ ఇండస్ట్రీని వణికిస్తోంది. రెండు వారాల క్రితం ప్రభుత్వ అనుమతులతో టీవీ సీరియల్ షూటింగ్స్ పునః ప్రారంభః అయిన విషయం తెలిసిందే. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టుగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినా కరోనా మాత్రం కాటేస్తోంది. ఇటీవల టీవీ నటుడు ప్రభాకర్కు కరోనా సోకడంతో టీవీ ఇండస్ట్రీలో కల్లోలం మొదలైంది.
అతనితో కాంటాక్ట్లో వున్న మరో నటుడు కృష్ణ కూడా కరోనా బారిన పడటంతో సీరియల్ నటుల్లో కలవరం మొదలైంది. ఆమెకథ, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్లో నటిస్తున్న నవ్యా స్వామికి తాజాగా పాజిటివ్ రావడంతో టీవీ ఇండస్ట్రీ అప్రమత్తమైంది. ఎంత జాగ్రత్త పడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెతో కలిసి `ఆమె కథ`లో నటిస్తున్న రవికృష్ణ తాజాగా కరోనా వైరస్ సోకిందని తేలడంతో టీవీ ఇండస్ట్రీ వణికిపోతోంది. రవికృష్ణ బిగ్బాస్3 తో పాపులర్ అయిన విషయం తెలిసిందే.
`నేను గత మూడు రోజులగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాను. మీ ఆశీర్వాదాలతో, దేవుని దయతో బాగానే వున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నాకు ఇది ఎవరి ద్వారా సోకిందో దాని గురించి చింతించడం లేదు. నాతో కాంటాక్ట్ అయిన వారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లక్షణాలు వుంటే స్వీయ నిర్భంధంలోకి వెళ్లండి. వైరస్ సోకిన వారిని మరోలా చూడవద్దని, వారిని వివక్షతతో చూడవద్దని కొంత మందిని అభ్యర్థిస్తున్నాను. నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండనివ్వండి` అని సోషల్ మీడియా వేదికగా రవికృష్ణ ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేశాడు.
View this post on Instagram