మహేష్ బాబు తాజాగా కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టాడు . ఈ రక్షాబంధన్ కు సోదరుడి కి రాఖీ తో పాటుగా హెల్మెట్ ని కానుకగా ఇవ్వాలని ”సిస్టర్స్ ఫేర్ చేంజ్ ” అనే క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టాడు మహేష్ . అదేంటి ఈ క్యాంపెయిన్ పార్లమెంట్ సభ్యురాలు కవిత చేస్తున్నది కదా ! అనే డౌట్ ఉంది కదా మీకు ! అవును గత ఏడాది ఎంపీ కవిత ఈ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టగా ఈ ఏడాది మహేష్ బాబు తోడయ్యాడు . ఎంపీ కవిత చేస్తున్న క్యాంపెయిన్ కు ఆకర్షితుడై ఓ వీడియో ని పోస్ట్ చేస్తూ ఈ రాఖీ పండగ కు మీ సోదరుడి కి రాఖీ తో పాటుగా హెల్మెట్ కూడా బహుమతి గా ఇవ్వండి అంటూ ప్రచార వీడియో ని వదిలాడు .
ప్రతీ ఏటా యాక్సిడెంట్ లలో వందలాది గా చనిపోతున్నారు అయితే అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే మరణాలు ఎక్కువ దాంతో ఈ క్యాంపెయిన్ చేస్తున్నాడు మహేష్ . ఇక ఎంపీ కవిత మహేష్ బాబు వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత ప్రచారం కల్పిస్తోంది . ప్రస్తతం మహేష్ మహర్షి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: trs mp kavitha posted mahesh babu video
Happy Birthday @urstrulyMahesh garu !! Best wishes and a heartfelt thank you for your video message supporting this virtuous cause of #Sisters4Change. I’m sure this will inspire others to #GiftAHelmet and save precious lives ! pic.twitter.com/0KcK7DZLQa
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 9, 2018