సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది సూపర్ క్రేజ్ ఉన్న కాంబినేషన్. వీరిద్దరూ కలిసి రెండు చిత్రాలకు పనిచేసారు. అటు అతడు, ఇటు ఖలేజా రెండూ కూడా క్లాసిక్స్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వీరు కలిసి పనిచేస్తోన్న విషయం తెల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్ర స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట. డైలాగ్ వెర్షన్ తో సహా ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. మహేష్ కు ఫైనల్ నరేషన్ ఇచ్చేస్తే ఇక అన్నీ సెట్ అయినట్లే. మరోవైపు ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలవుతాయని అంటున్నారు.
అక్టోబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టాలన్నది అసలు ప్లాన్. మరి ఆ సమయానికి మహేష్, సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేయగలడా అన్నది చూడాలి.