అల్లు అర్జున్తో మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం `అల వైకుంఠపురములో`. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అల్లు అర్జున్ కొన్నేళ్లుగా కన్న ఇండస్ట్రీ హిట్ కలని నిజం చేసింది. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్నిహారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్. రాధాకృష్ణ, హీరో నందమూరి కల్యాణ్రామ్ నిర్మించనున్నారు.
పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జూన్ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ కారణంగా ప్లాన్ మారింది.
రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షెడ్యూల్ కూడా మారబోతోంది. దీని కారణంగా ఎన్టీఆర్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఫ్రీ కాబోతున్నారు. ఇన్ని నెలలు వేయిట్ చేయడం ఇష్టం లేని త్రివిక్రమ్ `అఆ` తరహా చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారట.