పవర్స్టార్ పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని, తన మాస్ సినిమాలతో ఆకట్టుకోవాలని, మిగతా స్టార్స్లాగే ఆయన ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఫలించి పవర్స్టార్ `పింక్` రీమేక్తో మళ్లీ సినిమాలు మొదలపెట్టారు. ఇది ఆయన నటిస్తున్న 26వ చిత్రం. దీనికి `వకీల్ సాబ్` అనే టైటిల్ని రిజిస్టర్ చేయించినట్టు తాజా న్యూస్. ఈ సినిమాతో పాటు పవన్ ఏకంగా మరో మూడు చిత్రాల్ని లైన్లో పెట్టారు.
27వ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పవన్ ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా తెరపైకి తీసుకురానున్నారట. ఇటీవలే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. బందిపోటు గజదొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నారు. పిరియాడిక్ డ్రాయాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం రండు భారీ సెట్లని సిద్ధం చేస్తున్నారు. ఇదిలా వుంటే 28వ చిత్రంగా మైత్రీ మూవీమేకర్స్లో ఓ చిత్రానికి పవన్ కమిట్ అయ్యారు. దీనికి హరీష్శంకర్ దర్శకుడు.
ఇక 29వ సినిమాని కూడా పవన్ ఓకే చేసినట్టు తెలిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారని కన్ఫమ్ అయింది. `అజ్ఞాతవాసి` పరాజయం తరువాత పవన్, త్రివిక్రమ్ కలిసి ఈ చిత్రాన్ని చేయబోతున్నారు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా వుంటుందని ఇండస్ట్రీ టాక్.