స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. త్రిష 2015లో వరుణ్ మనియన్ని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఎంగేజ్మెంట్ తరువాత పెళ్లిని రద్దు చేసుకోవడం అప్పట్లో కోలీవుడ్లో సంచలనంగా మారింది. సినిమాల్లో నటించడం మానలేకే త్రిష తన వివాహాన్ని రద్దు చేసుకుందని వార్తలు వినిపించాయి.
అయితే గత రెండు మూడు రోజులుగా త్రిష తన పెళ్లిని అర్థాంతరంగా రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్రిషతో పాటు శింబు స్పందించడం లేదు. కానీ శింబు తండ్రి టి. రాజేందర్ మాత్రం ఆగ్రహంతో వున్నారని తెలుస్తోంది. శింబు పెళ్లి గురించి ప్రస్థావిస్తే ఆగ్రహాంతో ఊగిపోతున్నారట ఆయన.
ఇదిలా వుంటే కోలీవుడ్లో త్రిష, శింబులకు సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష – శింబు డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నారని, అది శింబు తండ్రి టి. రాజేందర్కు ఇష్టం లేదని, ఆ కారణంగానే ఆయన శింబు పెళ్లి గురించి అడిగితే అసహనానికి గురవుతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్రిష, శింబు ఏమంటారో చూడాలి.