స్టార్ డైరెక్టర్లు హరీష్శంకర్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాల కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. భారీగా తదుపరి చిత్రాల కోసం ఈ దర్శకులు ప్లాన్ లు చేసుకున్నారు. స్క్రిప్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే కరోనా దెబ్బతో వారి ప్లాన్లన్నీ తలక్రిందులైపోయాయి. దీంతో ఈ దర్శకులు కొత్త దారులు వెతుకుతున్నారు.
హరీష్ శంకర్ స్టార్ హీరో పవర్స్టార్ పవన్ కల్యాణ్తో సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే కరోనా కారణంగా ఈ మూవీ వచ్చే ఏడాది స్టార్టయ్యే అవకాశం వుండటంతో హరీష్ శంకర్ ఆలోపు వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నారట. ఇక `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంగా `ఎఫ్2` సీక్వెల్ని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆయన ప్లాన్ కూడా తారుమారైంది. దీంతో తను కూడా వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్లు చేసుకుంటున్నాడట.
కోటిన్నర బడ్జెట్తో 20 నుంచి 25 రోజుల్లో వెబ్ సిరీస్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ని ఆహా కోసం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దర్శకుడితో పాటు వంశీ పైడి పల్లి కూడా `ఆహా` కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఆహా కోసం వెబ్ సిరీస్ బాట పట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.