Homeటాప్ స్టోరీస్వెబ్ బాట ప‌డుతున్న ఆ ముగ్గురు!

వెబ్ బాట ప‌డుతున్న ఆ ముగ్గురు!

వెబ్ బాట ప‌డుతున్న ఆ ముగ్గురు!
వెబ్ బాట ప‌డుతున్న ఆ ముగ్గురు!

స్టార్ డైరెక్ట‌ర్‌లు హ‌రీష్‌‌శంక‌ర్, వంశీ పైడిప‌ల్లి, అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాల కోసం రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. భారీగా త‌దుప‌రి చిత్రాల కోసం ఈ ద‌ర్శ‌కులు ప్లాన్ లు చేసుకున్నారు. స్క్రిప్ట్‌లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే క‌రోనా దెబ్బ‌తో వారి ప్లాన్ల‌న్నీ త‌ల‌క్రిందులైపోయాయి. దీంతో ఈ ద‌ర్శ‌కులు కొత్త దారులు వెతుకుతున్నారు.

హ‌రీష్ శంక‌ర్ స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అయితే క‌రోనా కార‌ణంగా ఈ మూవీ వ‌చ్చే ఏడాది స్టార్ట‌య్యే అవ‌కాశం వుండ‌టంతో హ‌రీష్ శంక‌ర్ ఆలోపు వెబ్ సిరీస్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇక `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి త‌న త‌దుప‌రి చిత్రంగా `ఎఫ్‌2` సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురావాల‌నుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆయ‌న ప్లాన్ కూడా తారుమారైంది. దీంతో త‌ను కూడా వెబ్ సిరీస్ చేయాల‌ని ప్లాన్‌లు చేసుకుంటున్నాడ‌ట‌.

- Advertisement -

కోటిన్న‌ర బ‌డ్జెట్‌తో 20 నుంచి 25 రోజుల్లో వెబ్ సిరీస్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసింది. ఈ వెబ్ సిరీస్‌ని ఆహా కోసం చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ద‌ర్శ‌కుడితో పాటు వంశీ పైడి ప‌ల్లి కూడా `ఆహా` కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇలా ముగ్గురు స్టార్ డైరెక్ట‌ర్‌లు  ఆహా కోసం వెబ్ సిరీస్ బాట ప‌ట్ట‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All