అటల్ బిహారి వాజ్ పేయి పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంత బ్రహ్మచారి గా ఎందుకున్నాడో తెలుసా ……. లేలేత వయసులో తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమని సఫలం చేసుకోకపోవడమే కారణం . కళాశాలకు వెళుతున్న రోజుల్లో తన తోటి విద్యార్ధి అయిన రాజ్ కుమారి ని తొలిచూపులోనే ప్రేమించాడట ! అయితే ఆమెకు తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు కానీ ఆలోచన వచ్చిందే తడవుగా ప్రేమలేఖ రాసి ఆమె పుస్తకంలో పెట్టాడట . అసలే వాజ్ పేయి కవితలను అద్భుతంగా రాసే వ్యక్తి కావడంతో అటల్ ప్రేమలేఖ కు ఫిదా అయ్యిందట రాజ్ కుమారి . అయితే ఈ ప్రేమ విషయం రాజ్ కుమారి ఇంట్లో తెలియడంతో ఒకే కులానికి చెందినవాళ్లు అయినప్పటికీ పెళ్ళికి నిరాకరించారట ! దాంతో చేసేదిలేక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడు .
అయితే ప్రేమలో విఫలం కావడంతో భగ్న ప్రేమికుడిగా మారకుండా రాజకీయాలపై ఆసక్తి మలుచుకున్నారు కాలక్రమంలో భారతదేశం గర్వించతగ్గ వ్యక్తిగా రూపాంతరం చెందాడు . కట్ చేస్తే దేశ రాజధాని ఢిల్లీ లో మళ్ళీ రాజ్ కుమారి భర్త అటల్ కు పరిచయం కావడం తో ఆ కుటుంబ సన్నిహితుడిగా మారాడు . రాజ్ కుమారి భర్త చనిపోయాక అటల్ నీడలోనే రాజ్ కుమారి తనువూ చాలించింది . ఇక ఈరోజు అటల్ బిహారి వాజ్ పేయి దహన సంస్కారాలు నిర్వహించింది రాజ్ కుమారి కూతురు నమిత కావడం విశేషం . నమిత ని దత్తత తీసుకున్నాడు అటల్ బిహారి వాజ్ పేయి . ప్రేమ పేరుతో విచ్చలవిడిగా ఎంతమందిని పడితే అంతమంది ని ప్రేమిస్తున్న ఈరోజుల్లో అటల్ బిహారి వాజ్ పేయి లాంటి అసలు సిసలైన ప్రేమికుడు ఎవరికి దొరుకుతాడు .
English Title: the untold love story of atal bihari vajpayee