Homeటాప్ స్టోరీస్త‌రుణ్‌భాస్క‌ర్ `నీకు మాత్ర‌మే చెప్తా`?

త‌రుణ్‌భాస్క‌ర్ `నీకు మాత్ర‌మే చెప్తా`?

త‌రుణ్‌భాస్క‌ర్ `నీకు మాత్ర‌మే చెప్తా`?
త‌రుణ్‌భాస్క‌ర్ `నీకు మాత్ర‌మే చెప్తా`?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తరుణ్‌భాస్క‌ర్ రూపొందించిన చిత్రం `పెళ్లిచూపులు`. ద‌ర్శ‌కుడిగా ఈ చిత్ర డైలాగ్‌ల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక‌ర్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న త‌రుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత `ఈ న‌గ‌రానికి ఏమైంది?` చిత్రాన్ని రూపొందించారు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ ఫ‌లితాన్ని అందించింది. ద‌ర్శ‌కుడిగా త్వ‌ర‌లో భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందులో వెంక‌టేష్ హీరోగా న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపించాయి.

త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ హీరోగా సినిమా వుంటుంద‌ని డి. సురేష్‌బాబు ఆ మ‌ధ్య మీడియాతో వెల్ల‌డించారు కూడా కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ మ‌ళ్లీ బ‌య‌టికి రాలేదు. త‌రుణ్ న‌టుడిగా మారిపోయారు. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ కొత్త త‌ర‌హా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. త‌రుణ్ భాస్క‌ర్ వాట్ నెక్ట్స్ అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి.

- Advertisement -

వెబ్ సిరీస్ వైపు వెళుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనూహ్యంగా ఆయ‌న ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ కోసం ఓ షో చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. `నీకు మాత్ర‌మే చెప్తా` పేరుతో ఈ షోని డిజైన్ చేసిన‌ట్టు స‌మాచారం. మొత్తం 25 ఎపిసోడ్‌లు ఈ షో వుంటుంద‌ని, త్వ‌ర‌లోనే ఇది ప్రారంభం అవుతుంద‌ని త‌రుణ్‌భాస్క‌ర్ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఇండైరెక్ట్‌గా వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All