టాలీవుడ్లో తన యాటిట్యూడ్తో సరికొత్త ఇమేజ్ని, క్రేజ్ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం `వరల్డ్ ఫేమస్ లవ్స్టోరీ`. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
రాశిఖన్నా, కేథరిన్, ఐశ్వర్యారాజేష్, ఇజబెల్లా లిలయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.ఎస్. రామారావు
సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14న రిలజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ చిత్ర ట్రైలర్ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ సినిమా వస్తోందంటే హడావిడి, ఎగ్జైట్మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్లోచ నిర్మాతల్లో ఆసక్తి వుంటుంది. ఈ సారి ఈ సినిమా కోసం అలాంటి ట్రిక్స్ ఏమీ చేయలేదు సిన్సియర్గా సినిమా కోసం కష్టపడ్డాను. దీని కోసం నేనేమీ హడావిడి చేయలేదు. ఈ నెల 9న ప్రీరిలీజ్ ఈవెంట్ వుంది. ట్రైలర్తో బయట హడావిడి మొదలవుతుంది. ఇదే నా లాస్ట్ లవ్స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. నా లైఫ్లో ఇప్పుడే కొత్త దశలోకి వెళుతున్నాను` అని కొత్తగా మాట్లాడాడు విజయ్.
`ఇందులో నలుగురు బ్యూటిఫుల్ లేడీస్ నటించారు. ఈ నలుగురు తమ పాత్రల్ని తమ నటనతో చించేశారు. ఈ సినిమాని పూర్తి ప్రేమతో నింపేశాం. క్రాంతి మాధవ్కు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి. ఫిబ్రవరి 14న కంప్లీట్ ప్యాకేజీతో మీ ముందుకు రాబోతున్నాను` అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.