ప్రముఖ తమిళ నటుడు కార్తీక్ శనివారం సాయంత్రం ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంద తలెత్తడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. తాజా మీడియా నివేదికల ప్రకారం కార్తీక్ ప్రస్తుతం చెన్నైలోని అడయార్లోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో ఉన్నారని తెలిసింది.
వైద్యుల బృందం కార్తీక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని చెబుతున్నారు. కాని ఇప్పటివరకు కార్తీక్ కుటుంబం లేదా ఆసుపత్రి నిర్వహణ వర్గాలు అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ముందుజాగ్రత్తగా ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు కార్తీక్ కు కోవిడ్ -19 పరీక్షను నిర్వహించారు. ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే ఈ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.
దీని గురించి తెలుసుకున్న అనేక మంది కోలీవుడ్ ప్రముఖులు కార్తీక్ కుటుంబాన్ని సంప్రదించి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారట. ఇదిలా వుంటే కార్తీక్ హాస్పిటల్ బెడ్పై వున్న ఓ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫొటో చూసిన ఆయన అభిమానులు కార్తీక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.