అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డిపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుండగా అన్ని చోట్లా టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి యూఎస్ లో అవుతోన్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.
లేటెస్ట్ సమాచారం అందే సమయానికి యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $4,00,000 డాలర్లు అందాయని సమాచారం. ఈ క్రేజ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 1 మిలియన్ దాకా వస్తుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో రాం చరణ్, చిరంజీవి, తమన్నా బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో, కన్నడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించారు. భారీ ఎత్తున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
- Advertisement -