సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై గత కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటవల సుశాంత్ తండ్రి రియాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెపై కేసు పెట్టడంతో సుశాంత్ కేసు కీలక మలుపు తిరిగింది. సుశాంత్ విషయంలో రియా దారుణంగా వ్యవహరించిందని సుశాంత్ తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
2019కి ముందు వరకు సుశాంత్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, రియా పరిచయం తరువాతే ఎందుకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సుశాంత్ సింగ్ తండ్రి కె.కె. సింగ్ ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా సుశాంత్కు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కుటుంబ సభ్యుల అనుమతి ఎందుకు తీసుకోలేదు? , రియా సూచన మేరకు సుశాంత్కు వైద్యం చేసిన డాక్టర్లు కూడా సూత్రధారులేనని నేను నమ్ముతున్నాను. నా కుమారుడికి మానసిక సమస్యలు తలెత్తినప్పుడు అండగా నిలవాల్సిన రియా కీలక పత్రాలని తీసుకుని వెళ్లిపోయింది. ఒంటరిగా వదిలేసింది. అందుకే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడు` అని కెకె సింగ్ ఆరోపిస్తున్నారు.
సుశాంత్ బ్యాంక్ ఖాతాలని పరిశీలించినప్పడు అతని అకౌంట్లో 17 కోట్లు వున్నట్టు తేలిసింది. వాటిలో 15 కోట్ల రూపాయలు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేయాలి. రియాతో సంబంధం పెట్టుకున్న దగ్గరి నుంచి సుశాంత్కు సినిమా అవకాశాలు తగ్గాయి. దీని వెనక జరిగిన కుట్ర ఏంటో విచారణ చేయాలి. కూర్గ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని సుశాంత్ ప్రయత్నిస్తే అందుకు రియా అడ్డు చెప్పిందని, తన మాట వినకపోలే చికిత్సకు సంబంధించిన వివరాల్ని మీడియాకు లీక్ చేస్తానంటూ బెదిరించిందని, ఆ తరువాత సుశాంత్ నుంచి ఎలాంటి డబ్బులు రావని తేలడంతో అతని వద్ద వున్న కీలక పత్రాలు, ల్యాప్ టాప్ని రియా తీసుకెళ్లిందని సుశాంత్ తండ్రి కీలక అనుమానాల్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.