కోలీవుడ్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ హీరో సూర్య. వివాదాలకు దూరంగా వుండే ఈ హీరో ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `సూరరాయి పోట్రు`. సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశమే నీ హద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
కరోనా కారణంగా ఈ మూవీని డైరెక్డ్గా ఓటీటీలో రిలీజ్ చేయాలని సూర్య ప్లాన్ చేశాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నామంటూ ప్రకటించారు కూడా. అయితే ఇప్పడు ఆ డేట్కి సినిమా రావడం లేదని హీరో సూర్య తాజాగా ప్రకటించి షాకిచ్చారు. చాలా రోజులుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న సూర్య ఫ్యాన్స్, ఆడియన్స్ సూర్య ప్రకటనతో షాక్ కు గురవవుతున్నారు.
ఈ మూవీ రిలీజ్ ఆగిపోవడానికి గల కారణాలని వెల్లడిస్తూ ట్విట్టర్ వేదికగా సూర్య ఓ ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేశారు. జాతీయ భధ్రత కారణాల దృష్ట్యా ఈ మూవీకి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావాల్సి వుంది. దాని కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. ఈ విషయాన్ని ఫ్యాన్స్, ఆడియన్స్ పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను`అని పేర్కొన్నారు. సూర్య నటించి నిర్మించిన ఈ చిత్రంలో కలెక్షన్కింగ్ మోహన్బాబు, పరేష్రావల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.