విలక్షణ పాత్రలతో విభిన్నమైన చిత్రాలతో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్నారు హీరో సూర్య. గత కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలేవీ ఆశించిన ఫలితాల్ని అందించలేకపోయాయి. తాజాగా సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` మంచి విజయాన్ని అందించడమే కాకుండా సూర్య కెరీర్కు సరికొత్త ఉత్సాహాన్ని జోష్ని అందించింది. ఈ మూవీతో గత కొంత కాలంగా రేసులో వెనకబడి వున్న సూర్య మళ్లీ ట్రాక్లోకి వచ్చారు.
హిట్ కోసం సాహోపేతంగా చేసిన ఈ మూవీ మళ్లీ సూర్యని మళ్లీ ట్రాక్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సారి కూడా మరో సాహసానికి సూర్య సిద్ధమవుతున్నారట. ఈ మూవీ తరువాత యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారన్నది తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ వుంటుందని ప్రచారం జరిగింది. అయితే ఆ కథని పక్కన పెట్టి కొత్తగా ప్రయత్నిద్దామని సూర్య శ్రీలంక తో ముడిపడి వున్న ఓ లైన్ని హరికి చెప్పి దాన్ని డెవలప్ చేయమన్నారట.
శ్రీలంకలో తమిళులపై దశాబ్దాలుగా సింహళీయులు దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు ఆగ్రహావేశాల్ని వెల్లగక్కింది.. తమిళుల కోసం పోరాడిన వేళుపళ్లై ప్రభాకరన్ చివరికి లంక సైన్యం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గత కొన్ని దశాబ్దాలుగా తమిళులకు, సింహళీయులకు మధ్య వర్గ పోరు జరుగుతూనే వుంది. ఇందులో ఏ అంశాన్ని తీసుకుని సూర్య సినిమాగా చేయబోతున్నడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ అంశం నేపథ్యంలో సూర్య సినిమా చేస్తే వివాదాలు చుట్టుముట్టడం ఖాయం అని కోలీవుడ్లో వినిపిస్తోంది.