Homeగాసిప్స్సురేందర్, వక్కంతం వంశీ మళ్ళీ కలవబోతున్నారా?

సురేందర్, వక్కంతం వంశీ మళ్ళీ కలవబోతున్నారా?

సురేందర్, వక్కంతం వంశీ మళ్ళీ కలవబోతున్నారా?
సురేందర్, వక్కంతం వంశీ మళ్ళీ కలవబోతున్నారా?

టాలీవుడ్ లో రైటర్, డైరెక్టర్ జోడీలు చాలా గతంలో సక్సెస్ఫుల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయ్ భాస్కర్ జోడి గత దశాబ్దంలో విజయవంతమైన జోడిగా చెబుతారు. అంత సక్సెస్ఫుల్ కాకపోయినా సక్సెస్ పెర్సెంటేజ్ ఎక్కువున్న రైటర్ – డైరెక్టర్ జోడిలలో వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి ముందుంటారు. వీరి కాంబినేషన్ చాలా కాలం పాటు సాగింది. అశోక్ సందర్భంగా మొదలైన వీరి అనుబంధం కిక్ 2 వరకూ సాగింది. వీరి కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం వంటి ఎంటర్టైనింగ్ సినిమాలు వచ్చాయి. అలాగే ఊసరవెల్లి వంటి మంచి కథాబలం ఉన్న చిత్రం కూడా వచ్చింది. కిక్ 2 తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వ ప్రయత్నాల్లో మునిగి మొదటి సినిమాగా నా పేరు సూర్య చేస్తే, సురేందర్ ధ్రువ, సైరా సినిమాలకు వేరే రైటర్ లతో కలిసి పనిచేసాడు.

ఇప్పుడు సురేందర్ రెడ్డి తన తర్వాతి సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అలాగే వక్కంతం కూడా నా పేరు సూర్య ప్లాప్ తర్వాత మరో సినిమాను చేజిక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నాడు. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ తమ మధ్య దూరాన్ని పక్కనపెట్టి కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఇద్దరూ గతంలో రేసు గుర్రం వంటి సూపర్ డూపర్ హిట్ కు పనిచేసిన వేళ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సన్నద్ధమవుతున్నాడు సురేందర్.

- Advertisement -

ఈ సినిమా స్క్రిప్ట్ కోసం వక్కంతం వంశీతో మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాడు. వంశీ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రేసుగుర్రం సినిమా టైమ్ లోనే దీని సీక్వెల్ తాలూకా లైన్ అనుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా దాన్ని మార్చి బన్నీకి వినిపించాలనుకుంటున్నారు. చూడాలి మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకూ వెళతాయో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All