Homeటాప్ స్టోరీస్వక్కంతం వంశీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

వక్కంతం వంశీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

వక్కంతం వంశీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
వక్కంతం వంశీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

రచయితగా వక్కంతం వంశీకి చాలా గౌరవం ఉండేది. తనను అందించిన కథలు వీటికి ప్రధాన కారణం. బృందావనం, టెంపర్, ఊసరవెల్లి, కిక్ వంటి ఎన్నో హిట్ సినిమాలు, కథా పరంగా ఉన్నతంగా ఉండే సినిమాలు అందించాడు వక్కంతం వంశీ. అయితే అందరు రచయితలు అందరూ దర్శకులు అవుతున్నట్లుగానే వంశీ కూడా చాలా ప్రయత్నాల తర్వాత దర్శకుడు అయ్యాడు. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రయత్నించాడు. చాలా నెలలు తనతో ట్రావెల్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అయితే కొద్ది నెలల గ్యాప్ లోనే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాతో దర్శకుడయ్యాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో వంశీకి రెండో సినిమా సెట్ అవ్వడానికి సమయం పడుతోంది. నా పేరు సూర్య విడుదలై రెండేళ్ల తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు.

అయితే ఈ గ్యాప్ లో వక్కంతం వంశీ ఏం చేస్తున్నట్లు? నా పేరు సూర్య వంటి ప్లాప్ ఇచ్చాక కూడా గీతా ఆర్ట్స్ సంస్థ వక్కంతం వంశీతో ట్రావెల్ చేస్తోంది. ప్రస్తుతం ఇదే ఆఫీస్ లో వంశీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా ఉన్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ లో తెరకెక్కే సినిమాలకు స్క్రిప్ట్ విషయంలో సహాయం చేస్తున్నాడు వంశీ. అలాగే ప్రాజెక్ట్స్ సెట్ చేయడంలో కూడా వంశీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా సెట్ అవ్వడానికి వంశీ పాత్ర కీలకమని స్వయంగా బన్నీ చెప్పాడు. త్రివిక్రమ్ తో నా ప్రాజెక్ట్ సెట్ చేసినందుకు వక్కంతం వంశీకి, బన్నీ వాసుకి కృతఙ్ఞతలు అని చెప్పాడు బన్నీ. సో వక్కంతం వంశీ రచయిత నుండి దర్శకుడిగా మారి ఆపై ఇప్పుడు స్క్రిప్ట్ కన్సల్టెంట్ వయా ప్రాజెక్ట్ ఫెసిలిటేటర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే త్వరలోనే తన రెండో ప్రాజెక్ట్ ను సెట్ చేయబోతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All