యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారుతున్నట్లు తెలుస్తోంది . సందీప్ కిషన్ హీరోగా పరిచయమై దాదాపు ఎనిమిదేళ్లు అయితే కెరీర్ లో మాత్రం కేవలం రెండు హిట్స్ మాత్రమే ఉన్నాయి . ఒకటి పరిచయ చిత్రం స్నేహగీతం , రెండోది వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ . ఈ రెండు చిత్రాల తర్వాత ప్రస్థానం చిత్రం మాత్రం నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది సందీప్ కిషన్ కు . అయితే టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు ఈ హీరో . హిట్ కోసం ఎంతగా పోరాడుతున్నప్పటికీ పాపం అది అందని ద్రాక్ష అవుతోంది దాంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడట .
అదే నిర్మాతగా మారడం , తెలుగు , తమిళ బాషలలో ఓ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు సందీప్ కిషన్ . తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . సొంత చిత్ర నిర్మాణంతో హీరోగా , నిర్మాతగా రెండు రకాలుగా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు . మరి అది అందుతుందా ? లేక ఆర్ధికంగా దెబ్బ తింటాడా ? చూడాలి . ఎందుకంటే సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు సుమా !
English Title: Sundeep kishan planning own production
Here’s a 1st look that I have been waiting to launch,my debut production along with @dayapannem #VenkatadriTalkies
Thank #VistaDreamMerchants @vstudiosoffl & @AnilSunkara1 garu for trusting us?#NinnuVeedaniNeedanuNene@caarthickraju @anyasinghoff @MusicThaman @vennelakishore pic.twitter.com/v4hxx7njBP— Sundeep Kishan (@sundeepkishan) November 23, 2018