బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్ ని కొంతమంది ఆగంతకులు అదేపనిగా బెదిరిస్తున్నారట ! తనని మాత్రమే బెదిరిస్తే భరించేవాడ్ని కానీ నా కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసారు అందుకే ఇక పై సోషల్ మీడియాలో నా అభిప్రాయాన్ని పంచుకోలేను ,దానికి గుడ్ బై చెబుతున్నాను అంటూ చివరి ట్వీట్ చేసాడు అనురాగ్ కశ్యప్. భారతదేశంలో దొంగలు పరిపాలకులు అయ్యారని అనురాగ్ దుయ్యబడుతున్నారు.
గతకొంత కాలంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ లు చేస్తున్నాడు అనురాగ్ కశ్యప్ , దాంతో అతడ్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అంతేనా ! ఫోన్ లు చేసి కూడా బెదిరిస్తున్నారట దాంతో తన కుటుంబ సభ్యుల కోసం ఇక ట్వీట్ ల యుద్ధం ఆపేస్తున్నానంటూ పేర్కొన్నాడు . సామాజిక సందేశం ఉన్న చిత్రాలు చేసే అనురాగ్ కశ్యప్ నిరాశావాదంతో ఉన్నాడు .
- Advertisement -