బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ COVID-19 వైరస్ సోకినట్టు తెలిసింది. అమీర్ ఒక కమర్షియల్ ప్రకటన కోసం షూటింగ్ చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిసిందని తెలిసింది. తనలో లక్షణాలను తెలుసుకున్న వెంటనే ఆయన పరీక్ష చేయించుకున్నారట. ప్రస్తుతం అమీర్ స్వీయ నిర్భంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమీర్ఖాన్ వ్యక్తిగత వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అమీర్ బాగానే ఉన్నాడని తన సిబ్బంది అందరికీ పరీక్ష చేయమని సమాచారం ఇచ్చాడని తెలిసింది.
అమీర్ ఖాన్ ప్రతినిధి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అమీర్ ఖాన్ కు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమీర్ స్వీయ-నిర్బంధంలో ఇంట్లో ఉన్నాడు. అతను బాగానే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనితో పరిచయం ఉన్న వారందరూ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ టెస్ట్లు చేయించుకోవాలి`అని ఆమీర్ ఖాన్ ప్రతినిధి పేర్కొన్నారు.
కోవిడ్ పాజిటివ్ అని తేలిన ఆమీర్ ఖాన్తో నటి కియారా అద్వానీ కూడా ఇటీవల షూటింగ్లో పాల్గొన్నారు. నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నకమర్షియల్ యాడ్లో ఆమీర్ఖాన్ తో కలిపి కియారా కూడా నటంచింది. దీంతో కియారాకు కొత్త టెన్షన్ మొదలైందట. దీంతో కియారా అద్వానీ, నితీష్ తివారీ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నట్టు తెలిసింది.