తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా వైరస్ అంటే భయంతో వణికిపోతోంది. ఎప్పుడు ఏ స్టార్ తనకు కోవిడ్ పాజిటివ్ అని ప్రకటిస్తారా అని భయపడుతోంది. ఇటీవల స్టార్ హీరో రామ్చరణ్, యంగ్ హీరో వరుణ్తేజ్ తమకు కరోనా సోకిందని, కానీ తమలో ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీకి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది.
అతను మరెవరో కాదు స్టార్ డైరెక్టర్ క్రిష్ అని తెలిసింది. ఇటీవల షూటింగ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సాయి ధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్తో ఓ చిత్రాన్ని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి షాకిచ్చారు క్రిష్. రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని `కొండ పొలం` నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా వుంటే దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడ్డారని తెలిసింది.
ఇటీవల టెస్ట్ చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. ప్రస్తుతం క్రిష్ హక్షమ్ క్వారెంటైన్లో విశ్రాంతి తీసుకుంటున్నారట. త్వరలో పవన్కల్యాణ్తో చేస్తున్న పిరియాడికల్ మూవీని క్రిష్ పునః ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్కి కరోనా సోకిన నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరింత ఆలస్యం కాబోతోంది.