`బాహుబలి`తో యావత్ భారతం తెలుగు సినిమా వైపు తిరుగి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి మళ్లీ ట్రిపుల్ ఆర్ (రుద్రం రణం రుధిరం)తో మరో సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. మెగాపవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో మల్టీస్టారర్ అన్న ఊహే రాని ఫ్యాన్స్కి ఈ కాంబినేషన్తో అద్భుతమైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ని అందించబోతున్నాడు.
అత్యంత భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య దక్షిణాదిలోనే తొలిసారి అత్యంత క్రేజీ కాంబినేషన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ ఆదివాసీల కోసం పోరు బాట పట్టిన కొమరం భీం పాత్రలో.. నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మూడొంతులు చిత్రీకరణ పూర్తయింది. ఇందులో సీతగా బాలీవుడ్ భామ అలియాభట్ నటిస్తోంది.
ఈ సందర్భంగా ఈ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాల్ని జక్కన్న వెల్లడించారు. సినిమాలో సీత పాత్ర కోసం అలియాభట్ని ఎందుకు తీసుకున్నారో వెల్లడించారు. లారక్, చెర్రి లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలకు సరితూగేలా ఎమోషన్స్ పండించాల్సిన బలమైన క్యారెక్టర్ సీతది. ఇది ముక్కోణ ప్రేమకథ కాకపోయినా సీత పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంది. అమాయకురాలే అయినా స్థిర చిత్తం కలిగిన మహిళ. అందుకే ఆ పాత్రకు అలియాభట్ని ఎంపిక చేసుకున్నాం`అని వెల్లడించారు. ఈ చిత్రాన్ని వచ్చేఏడాది జనవరి 8న రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.