కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతీ ఒక్కరరు ఇంటి పట్టునే వుంటున్నారు. దీంతో సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో టచ్ లోకి వస్తున్నారు. లైవ్ చాటింగ్లతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ శృతిహాసన్ లాక్డౌన్ వేళ ఫ్యాన్స్తో ముచ్చటించింది.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. గులాబి, చాక్లెట్, సిగరెట్, టొబాక్కో అంటే ఇష్టమని చెప్పింది. అయితే వాటిని కాల్చడం వల్ల వచ్చే పొగని మాత్రం తాను ఇష్టపడనని చెప్పింది. వెనిలా ఫ్లేవర్ వాసనని కూడా ఇష్టపడతానని, చిన్నతనంలో ఎరేజర్ వాసనని కూడా బాగా ఇష్టపడేదాన్నని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు నెటిజన్స్ శృతి మాటలకు అవాక్కయ్యారట.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా గుర్తింపుని సొంతం చేసుకున్న శృతిహాసన్ జోరు కాస్త ఈ మధ్య తగ్గింది. లండన్కు చెందిన నటుడు మైఖేల్ కోర్సల్తో కొంత కాలం డేటింగ్ చేసింది. దీంతో శృతిహాసన్ కెరీర్ ముగిసినట్టేనా అని వార్తలు వినిపించాయి.. దానికి తగ్గట్టుగానే శృతికి అవకాశాలు రావడం తగ్గిపోయింది. ఇటీవల మైఖేల్కు బ్రేకప్ చెప్పి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం రవితేజతో కలిసి `క్రాక్` చిత్రంలో నటిస్తోంది.