ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ఇప్పటి వరకు 50 వేలకు మరణాలు చోటు చేసుకున్నాయి. దీని బారి నుంచి తమని తాము కాపాడుకోవడం కోసం దేశాలన్నీ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాయి. దీంతో వ్యవస్థలన్నీ స్థింభించి పోయాయి.
సామాన్య జీవితం తలక్రిందులైంది. ప్రభుత్వాలు కరోనాని అరికట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ జనాల్లో అవేర్నెస్ లేక కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఇదిలా వుంటే కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీస్ ఇబ్బందుల్ని ఎదుర్కుంటోంది. లాక్డౌన్ పూర్తయినా సినిమా షూటింగ్లకు, రిలీజ్లకు ప్రభుత్వం అంత త్వరగా అనుమతులు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
ఈ విపత్కర పరిస్థితిలో సినిమాల రిలీజ్లు కష్టంగా మారడంతో అక్షయ్కుమార్ నటిస్తున్న `లక్ష్మీబాంబ్` చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. `కాంచన` ఆధారంగా రీమేక్ అవుతున్న ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్నారు. మేలో రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.