Homeగాసిప్స్స్పిరిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు టాలీవుడ్ సూపర్ స్టార్స్

స్పిరిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు టాలీవుడ్ సూపర్ స్టార్స్

స్పిరిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు టాలీవుడ్ సూపర్ స్టార్స్
స్పిరిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు టాలీవుడ్ సూపర్ స్టార్స్

రెబెల్ స్టార్ ప్రభాస్ తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా సినిమా అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని టిసిరీస్, యూవీ క్రియేషన్స్ తో పాటు భద్రకాళీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి స్పిరిట్ అనే ఆసక్తికర టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రభాస్ నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే స్పిరిట్ గురించి ఇప్పుడొక ఆసక్తికర విషయం బయటపడింది. ఈ సినిమాను ప్రభాస్ ఓకే చేయకముందు మొత్తం ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్స్ రిజెక్ట్ చేశారట. అర్జున్ రెడ్డి పూర్తి చేసిన తర్వాత సందీప్ రెడ్డి, రామ్ చరణ్ ను అప్రోచ్ అయ్యి స్పిరిటి బేసిక్ లైన్ ను వినిపించినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ కు నచ్చక పక్కన పెట్టేసాడు. ఆ తర్వాత మహేష్ బాబు లైన్లోకి వచ్చాడు. మహేష్ కోసం కథ మొత్తం సిద్ధం చేసాడు.

- Advertisement -

రెండు, మూడు సిట్టింగ్స్ అయ్యాయి కానీ మహేష్ సంతృప్తి చెందలేక వద్దని సున్నితంగా చెప్పేసాడు. అల్లు అర్జున్ తో కూడా ఈ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత సందీప్ స్పిరిట్ ను హోల్డ్ లో ఉంచి రన్బీర్ కపూర్ తో యానిమల్ ను చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ నుండి సందీప్ కు ఫోన్ వచ్చింది. వెంటనే స్పిరిట్ కు కొన్ని మార్పులు చేర్పులు చేసి వినిపించగా సింగిల్ సిట్టింగ్ లో ప్రభాస్ ఓకే చేసాడట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All